సిరాన్యూస్, బోథ్
ఎంపీ జి. నగేష్ ను కలిసిన బోథ్ మండల నాయకులు
ఆదిలాబాద్ ఎంపీగా గెలుపొందిన జి. నగేష్ ను శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని స్వగృహంలో ఎంపీని శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అప్క కిషన్, ఆదివాసీ నాయకులు, న్యాయవాది పంద్రం శంకర్, బీజేపీ మండల పార్టీ కన్వీనర్ రవీందర్, మాజీ కన్వీనర్ సుభాష్, సూర్య, నాయకులు మల్లెపూల రమేష్ , తదితరులు పాల్గొన్నారు.