సిరాన్యూస్,సైదాపూర్:
సొంతగుటికి చేరిన లంకదాసరి కళ్యాణ్
చిగురుమామిడి మండల కేంద్రంలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో జరిగిన సైదాపూర్, చిగురుమామిడి మండల సీపీఐ ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా సీపీఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి, సీపీఐ పార్టీ కరీంనగర్ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి లంకదాసరి కళ్యాణ్ కు సీపీఐ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీపీఐ పార్టీ భలోపేతానికి కృషి చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ బోయిని అశోక్, బత్తుల బాబు, చాడ శ్రీధర్ రెడ్డి, కంది రవీందర్ రెడ్డి ,వొడ్నాల వేంకటేష్, శ్రీనివాస్, సమ్మయ్య, రాజేషం, ఒజ్జ కొంరయ్య, అనిల్ తదితరులు పాల్గొన్నారు.