సిరా న్యూస్,పెద్దపల్లి;
సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో దారుణం జరిగింది. రైస్ మిల్లులో డ్రైవర్గా పనిచేసే బలరాం అనే వ్యక్తి ఓ ఆరేళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేశాడు. రైస్ మిల్లులో తల్లితో పాటు నిద్రిస్తున్న బాలికను సమీప పొదల్లోకి ఎత్తుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడు. అతడు బాలికను ఎత్తుకెళ్తున్న దృశ్యాలు సిసిటివి కెమెరాలో రికార్డు అయ్యాయి. తల్లిదండ్రులు, కార్మికులు నిందితుణ్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.