ఆరుగురు మృతి… పలువురికి గాయాలు
సిరా న్యూస్,విజయవాడ;
కృత్తివెన్ను మండలం సీతనపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. పలువురికి గాయాలుఅయ్యాయి. ఒక కంటైనర్ పాండిచ్చేరి నుండి భీమవరం రొయ్యల ఫీడ్ తీసుకువెళ్తుంది.ఎదురుగా బోలెరో వ్యాన్ అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా తాళ్ళరేవు నుండి కృత్తివెన్ను మండలం మునిపెడ వస్తుంది. శీతనపల్లి వద్ద పుల్లల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ను ఢీకొని ఓవర్ టాక్ చేస్తూ కంటైనర్ ను ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. ఘటనలో అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందగా గాయపడిన మరో ఆరుగురిని మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలిస్తుండగా మరొక వ్యక్తి మృతి చెందాడు. ఐదుగురు పరిస్థితి విషమంగా వుంది. తెల్లవారుజామున నాలుగు గంటలకు ప్రమాదం చోటు చేసుకోవడంతో రెండు మూడు కిలోమీటర్ల పొడవున ట్రాఫిక్ నిలిచిపోయింది.