సిరా న్యూస్,నారాయణపేట;
నారాయణపేట జిల్లా ఉట్కుర్ మండలం చిన్నపొర్ల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. భూతగదాలలో దాయదుల మధ్య ఘర్షణ చేలరేగింది. ఇరువర్గాలు పొలం దగ్గర కర్రలతో కొట్టుకున్నాయి. ఘర్షణలో గాయాపడ్డ చిన్నపొర్ల గ్రామానికి చెందిన గువ్వల సంజప్ప (28) మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గత కొద్దికాలం దాయదుల మధ్య భూ తగాదాలు కొనసాగుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు