క్రీడలు మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయ్

-మంథని ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన దుద్దిల్ల శ్రీను బాబు.

సిరా న్యూస్,మంథని ప్రతినిధి;

క్రీడలు మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయని అందరూ సాధ్యమైనంత వరకు ఏదేని క్రీడలోనైనా రోజులో కొంత సమయం కేటాయిస్తే ఆరోగ్యవంతంగా జీవించవచ్చని శ్రీపాద ట్రస్ట్ చైర్మన్, కాంగ్రెస్ యువ నాయకుడు దుద్ధిల్ల శ్రీను బాబు అన్నారు.
శుక్రవారం మంథని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మంథని ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ను దుద్దిళ్ళ శ్రీను బాబు, మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రి రమా సురేష్ రెడ్డి లు ముఖ్యఅతిదులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా దుద్దిళ్ల శ్రీనుబాబు మాట్లాడుతూ యువకులు క్రీడా రంగంలో కూడా ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశం ఉందని అలాగే యువతి యువకులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడా రంగంలో ముందుకు వెళ్లాలని కోరారు. అనంతరం క్రీడాకారులతో ముచ్చటించి టోర్నమెంట్లో పాల్గొంటున్న జట్టు సభ్యులందరికీ టి షర్టులను అందించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు ఐలి ప్రసాద్, జిల్లా కిసాన్ సేల్ అధ్యక్షుడు ముస్కుల సురేందర్ రెడ్డి ,కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒడ్నాల శ్రీనివాస్ , పోలు శివ ,అజీమ్ ఖాన్ , నూకల బానయ్య, యూత్ కాంగ్రెస్ నాయకులు పెంటరి రాజు ,సందీప్,తేజ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *