సిరా న్యూస్,సికింద్రాబాద్;
కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ నేడు 2వ వార్డు పరిధిలోని రసూల్ పుర సిల్వర్ కంపెనీ, నారాయణ జోపిడి ప్రాంతలలోని డబుల్ బెడ్ రూం ఇండ్ల పనులను పరిశీలించారు.. ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి వారి సాధకబాధలు తెలుసుకున్నారు.
ఈ సందర్బంగా శ్రీగణేష్ మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీలను విడతల వారీగా నెరవేరుస్తానని, నాపై నమ్మకంతో గెలిపించి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులోఉంటానని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ సహకారంతో డబుల్ బెడ్ రూమ్ లో పెండింగ్ పనులు త్వరిత గతిన పూర్తి చేసి లబ్దిదారులకు కేటాయింపులు చేస్తాం అని వెల్లడించారు. ఆశావర్కర్లు శ్రీ గణేష్ ను కలసి తమ సమస్యలను గురించి వివరించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తానని వారికి హామీనిచ్చారు.