Ravindra Chari: జాతీయ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం:  బ్రాహ్మండ్ల పల్లి రవీంద్రా చారి

సిరాన్యూస్‌, ఓదెల‌
జాతీయ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం:  బ్రాహ్మండ్ల పల్లి రవీంద్రా చారి

తెలుగు వెలుగు సాహితీ వేదిక జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ, విశ్వబ్రాహ్మణ వేద పురోహిత పాఠశాల వేములవాడ సంయుక్త ఆధ్వర్యంలో మాజీ ప్రధాని భారతరత్న శ్రీ పీవీ నరసింహారావు జయంతి ఉత్సవాలు-2024 శుభ సందర్భాన్ని పురస్కరించుకొని వివిధ రంగాల్లో కృషి చేసిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక , తమిళనాడు, ఒరిస్సా, మహారాష్ట్రలకు చెందిన వారు చేసుకోవచ్చని తెలుగు వెలుగు సాహితీ వేదిక స్వచ్ఛంద సేవా సంస్థ జాతీయ చైర్మన్ బ్రహ్మశ్రీ పోలోజు రాజ్ కుమార్ జాతీయ కన్వీనర్ బ్రహ్మశ్రీ డాక్టర్ వలబోజు మోహన్ రావు తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ బ్రహ్మశ్రీ డాక్టర్ పొడిచెట్టి విష్ణువర్ధన్ ఒక ప్రకటనలో తెలియజేశారు. సాహిత్యం, రచన, కవులు, కళాకారులు, సంగీతం, నృత్యం, భరతనాట్యం, కూచిపూడి, కోలాటం, చిత్రలేఖనం,శిల్పం, నాటకం , జానపదం, మిమిక్రీ , అవధానం, వైద్యం, విద్య, ఇంద్రజాలం, ముఖాభినయం, హరికథ, ఒగ్గు కథ, బుర్రకథ, రంగస్థలం కళాకారులు, వాస్తు, జ్యోతిష్యం, భక్తి, పురోహితం, యోగ, క్రీడాలు, సామాజిక సేవా , షార్ట్ ఫిలిం, పర్యావరణ పరిరక్షణ, సైన్స్ అండ్ టెక్నాలజీ, గ్రామీణాభివృద్ధి, డోలక్, హార్మోనియం , భజన కళా, యువజన మహిళా సంఘాలు, ఉపాధ్యాయ, ఉద్యోగ విద్యార్థులు , వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తులు ఈనెల 15లోగా అంద‌జేయాల‌ని తెలిపారు. పురస్కారాల ప్రదానోత్స‌వం ఈనెల 30న ఉంటుంద‌ని పేర్కొన్నారు. మ‌రిన్ని వివ‌రాల కోసం 9100174351, 9441261585, 9989464261 ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి బ్రాహ్మండ్ల పల్లి రవీంద్రా చారి సంపాదించాల‌ని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *