V Padma: ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ మ‌న క‌ర్త‌వ్యం: ప్రధానోపాధ్యాయురాలు వి పద్మ

సిరా న్యూస్, ఓదెల
ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ మ‌న క‌ర్త‌వ్యం: ప్రధానోపాధ్యాయురాలు వి పద్మ
* పర్యావరణ పరిరక్షణ కోసం నర్సరీ సందర్శన

ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ మ‌న క‌ర్త‌వ్యం ప్రధానోపాధ్యాయురాలు వి పద్మ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శ‌నివారం పెద్దపల్లి జిల్లా ఓదెల‌ జ‌డ్పీహెచ్ఎస్‌ ఓదెల ఎన్జిసి టీం తో ఓదెల నర్సరీని ప‌రిశీలించారు.. అక్కడ వివిధ రకాల మొక్కలను పరిశీలించి అవగాహన క‌ల్పించారు. మేరీ లైఫ్ ఎన్విరాన్మెంటల్ లైఫ్. పర్యావరణ పరిరక్షణ గురించి విద్యార్థులకు అవగాహన క‌ల్పించారు. పర్యావరణ పరిరక్షణ అనేది మన జీవనశైలిపై ఆధారపడి ఉంటుంద‌ని తెలిపారు. అనంత‌రం పాఠశాలలో మొక్కలను నాటారు. పర్యావరణ పరిరక్షణ గురించి విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎస్ఎంసి చైర్మన్ డాక్టర్ ఇప్పనపల్లి వెంకటేశ్వర్లు ,ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *