సిరా న్యూస్,పెద్దపల్లి’;
సుల్తానాబాద్ బాలికపై హత్యాచారం, నారాయణపేట్ ఉట్కూర్లో వ్యక్తిని కొట్టి చంపిన ఘటనలను, సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా పరిగణించారు. హత్యాచార నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి, కఠిన శిక్ష పడేలా చూడాలని డీజీపీ రవిగుప్తాను ఆదేశించారు. శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని సూచించారు.