సిరా న్యూస్, ఆదిలాబాద్
కట్టుకున్న భార్యే కడతేర్చింది
* ఉపాధ్యాయుడు గజేందర్ హత్య మిస్టరీ కేసును ఛేదించిన పోలీసులు
* నలుగురి అరెస్ట్, రిమాండ్
* వివరాలు వెల్లడించిన నార్నూర్ డీఎస్పీ నాగేందర్
అగ్నిసాక్షిగా ఏడడుగులు నడిచిన భార్యే భర్త పాలిట యముడిగా మారింది. కట్టుకున్న భర్తనే కర్కశంగా హతమార్చింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు శనివారం ఆదిలాబాద్ ఉట్నూర్ మండలం పోలీసు స్టేషన్లో నార్నూర్ డీఎస్పీ నాగేందర్ వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని మేడిగూడ జడ్పీహెచ్ ఎస్ పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా రాథోడ్ గజేందర్ విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాంనగర్ లోని తన భార్య అగు విజయలక్ష్మి, కొడుకుతో నివాసం ఉంటున్నాడు. 2015 సంవత్సరంలో రాథోడ్ గజేందర్ భార్య అగు విజయలక్ష్మి నిజామాబాద్ లో డిగ్రీ చదువుతున్న సమయంలో నేరస్తుడు అనే రాథోడ్ మహేష్ కూడా నిజామాబాద్ లోనే డిగ్రీ చదువుతున్నప్పుడు పరిచయమై ప్రేమగా మారింది. తర్వాత విజయలక్ష్మి తల్లిదండ్రులు గజేందర్ తో 2017 లో వివాహం చేశారు. కానీ గజేందర్ కొద్దిగా వికలాంగుడు కావడంతో విజయలక్ష్మి అతనిని ఇష్టపడకుండా రాథోడ్ మహేష్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది. అప్పటినుంచి ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుంటూ అక్రమ సంబంధం కొనసాగించారు. ఈ విషయము భర్త గజేందర్ కు తెలవగా పెద్దమనుషులతో పంచాయతీ జరిపించారు.అప్పుడు విజయలక్ష్మి భర్తతో క్షమాపణ కోరింది. కానీ ఆమె అక్రమ సంబంధం కొనసాగించింది. వేసవి సెలవులలో తన సొంత గ్రామమైన నార్నూర్ మండలం నాగల్కొండ కు తన భార్య కొడుకుతో గజేందర్ ఉంటున్నాడు. మృతుని భార్య విజయలక్ష్మి తన ప్రియుడు మహేష్ తో తన భర్త గజేందర్ కు ఎలాగైనా చంపేయాలని పథకం పన్నిన్నారు. ఈనెల 11న తన ప్రియుడు మహేష్ తో ఫోన్ చేసింది. ఈనెల 12న ఉదయం తన భర్త గజేందర్ స్కూల్ కు బైక్ పై వెళ్తాడు, అప్పుడు నువ్వు అతని చంపేయ్ చెప్పింది. పథకం ప్రకారం మహేష్ బేలకు చెందిన ఇద్దరు మనుషులతో మాట్లాడి రూ. 3 లక్షల చొప్పున ఇస్తాను చెప్పాడు. గజేందర్ను చంపేయమని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈనెల 12న ఉదయం 6 గంటలకు మహేష్, అతని స్నేహితులు బోడె సుషీల్, ఊరవేత కృష్ణ రెండు బైకులపై గాదిగూడ మండలంలోని లోకారి గ్రామానికి చేరుకున్నారు. గజేందర్ గురించి కాపు కాస్తూ ఉన్నారు. ఉదయం 08:30 గంటలకు గజేందర్ తన బైక్ పై లోకారి దాటి వెళుతుండగా అతనిని వెంబడించారు. అర్జుని గ్రామ శివారు దగ్గర గజేందర్ బండికి గుద్దగా అతను క్రింద పడిపోయాడు. అతనిని గుంజుకుంటూ కొద్ది దూరం ఒక చేనులో తీసుకెళ్లి వెళ్లి అతనిని బండలతో తలపై ఇతర శరీర భాగాలపై కొట్టి చంపారు. తర్వాత గజేందర్ భార్య విజయలక్ష్మి తన భర్త ఫోను స్విచ్ ఆఫ్ వస్తుందని భర్త ఆచూకీ కోసం తన బావ కొడుకు అంకిత్ తో సంఘటన ప్రదేశానికి వెళ్లి మహేష్ , అతని స్నేహితులను ఇక్కడ నుంచి వెళ్లిపోండి అని సైగా చేయగా వారు అక్కడ నుండి వెళ్లిపోయారు. తర్వాత విజయలక్ష్మి తన మామకు ఫోన్ చేసి తన భర్తను ఎవరో చంపేశారని తెలిపింది. డీఎస్పీ నాగేందర్ ఉట్నూర్ ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం, నార్నూర్ సిఐ రహీం పాషా తన సిబ్బందితో నేరస్తులను ట్రెస్ చేసి పట్టుకున్నారు.అనంతరం నలుగురు నేరస్తులను శనివారం అరెస్ట్ చేసి, రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పర్చినట్లు తెలిపారు.