సిరా న్యూస్, ఆదిలాబాద్
దహిగూడ నీటి సంపును పరిశీలించిన మాజీ మంత్రి జోగు రామన్న
ఆదిలాబాద్ రూరల్ ప్రాంతంలో తాగునీటీ ఇబ్బందులను దూరం చేస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టి తాగునీటి సౌకర్యాన్ని కల్పించిందని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. శనివారం ఆదిలాబాద్ రూరల్ మండలంలో మాజీ మంత్రి జోగు రామన్న రూరల్ ప్రాంత ప్రజల ఎదుర్కొంటున్న తాగునీటి ఇబ్బందులపై ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా పిప్పలదరి, దహిగూడ గ్రామాలలో పర్యటించారు. గ్రామస్తులను తాగునీటి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. దహిగూడలో గత బీఆర్ ఎస్ ప్రభుత్వం గల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ సంపు కేంద్రాన్ని జోగు రామన్న పరిశీలించారు. సంపులోకి నీరు చేరకపోవడంతో గ్రామంలో నీటి కొరత ఏర్పడుతుందని పేర్కొన్నారు. గ్రామస్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందిపై త్వరలో పరిష్కార దిశగా కృషి చేస్తామని తెలిపారు..ఈ కార్యక్రమంలో ఎంపీపీ గండ్రత్ రమేష్, ఎజ్జగిరి నారాయణ, కొమ్ర రాజు, పరమేశ్వర్ గ్రామస్తులు పాల్గొన్నారు.