సిరాన్యూస్, ఆదిలాబాద్
హనుమాన్ భక్తులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి: ఎమ్మెల్యే పాయల్ శంకర్
గత బిఆర్ఎస్ ప్రభుత్వం తరహాలోనే కాంగ్రెస్ ప్రభుత్వం సైతం హిందువులపై అక్రమ కేసులను పెడుతుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముధోల్ ఎమ్మెల్యే రామారావు పాటేల్ , అదిలాబాద్ ఎంపీ నగేష్లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు మాజీ మంత్రి కేటీఆర్ రాముడుపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఎన్నికల సమయంలో బైంసాలో కేటీఆర్ సమావేశం వద్ద శాంతియుతంగా నిరసన తెలిపితే హనుమాన్ భక్తులను సైతం జైల్లో పెట్టిందన్నారు. హనుమాన్ భక్తుల మీద పెట్టిన కేసులను ఎత్తివేయాలన్నారు. హనుమాన్ భక్తులకు పోలీసులు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. హనుమన్ దీక్షలో ఉన్న వారు ఏ విధంగా దాడులు చేస్తారని ప్రశ్నించారు. హనుమాన్ భక్తులను మీద పెట్టిన కేసులన్నీ విత్ డ్రా చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ పక్షాన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హిందువులతో గొక్కున్న పార్టీలు రాజకీయంగా పుట్ట గతులు లేకుండా పోయాయని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు ఉన్నారు.