సిరాన్యూస్,చిగురుమామిడి
రేకొండ వినాయక రెడ్డి సంఘం అధ్యక్షుడిగా దాసరి సాగర్ రెడ్డి ఎన్నిక
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో సోమవారం వినాయక రెడ్డి సంఘం ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల్లో అధ్యక్షుడిగా దాసరి సాగర్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా వర్ణ సుధాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా తాటికొండ సంపత్ రెడ్డి కోశాధికారి చాడ అనిల్ రెడ్డి లు ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి రెంటాల శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెడ్డి సంఘం అభివృద్ధి కోసం పనిచేస్తామని తెలిపారు.కార్యవర్గ సభ్యులు పర్పటి రవీందర్ రెడ్డి, పోరాండ్ల సంపత్ రెడ్డి, కాంతారావు లక్ష్మారెడ్డి, బిల్లా చంద్రారెడ్డి, రొంటాల సూర్య ప్రకాష్ రెడ్డి, రొంటాల ఉమామహేశ్వర్ రెడ్డి, అరుణ్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, రవీందర్ రెడ్డి ఎన్నికయ్యారు.