సిరాన్యూస్,ఓదెల
ఎమ్మెల్యే విజయ రమణారావు చిత్రపటానికి పాలాభిషేకం
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గూడెం గ్రామంలో బీరన్న దేవాలయానికి, రైతులు తమ పంట పొలాలకు వెళ్లేందుకు దారి సరిగా లేక ఇబ్బంది పడుతున్నారు.ఈవిషయాన్ని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మట్టి రోడ్డు మరమ్మతులకు రూ. 5లక్షలు మంజూరు చేశారు. ఈసందర్భంగా సోమవారం రైతులు ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అలాగే పోత్కా పల్లి గ్రామంలో వ్యవసాయ పనులకు వెళ్లే రోడ్డు మరమ్మతులకు మూడు లక్షల నిధులు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణ రావుకి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఓదెల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు రైతులు తదితరులు ఉన్నారు