పోలవరాన్ని సందర్శించిన చంద్రబాబు

సిరా న్యూస్,కోవూరు;
ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరి ప్రాజెక్టు వద్దకు చేరుకున్నా రు. పోలవరం ప్రాజెక్టు వద్దకు వస్తూ హెలికాప్టర్ నుంచి స్పిల్వే సహా వివిధ
ప్రాంతాలను ఆయన వీక్షించారు. ప్రాజె క్టు సమీపంలో ఏర్పాటు చేసిన హెలి ప్యాడ్ వద్ద మంత్రులు నిమ్మల రామా నాయుడు, కొలుసు పార్థసార థితో పాటు ఎమ్మెల్యేలు, తెదేపా ముఖ్య నేతలు ఆయనకు స్వాగతం పలికా రు.అనంతరం ప్రాజెక్టు వద్దకు చేరుకుని అధికారులతో మాట్లాడారు. స్పిల్వే, కాఫర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ పనుల పురోగతిపై జలవనరుల శాఖ అధికారులను అడిగి తెలుసుకు న్నారు. ఆ తర్వాత వారితో కలిసి బస్సులో ప్రాజెక్టు పరిసరాలను పరి శీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను తిలకించారు. గతంలో ఎడమగట్టు వద్ద కుంగిన గైడ్బండ్ ప్రాంతాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడారు. 22, 23 గేట్ల నుంచి ప్రాజెక్టు పరిసరాలను పరిశీలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *