2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిల‌పాల‌న్న‌దే ప్ర‌ధాన‌మంత్రి సంక‌ల్పం చిలుకూరి రామ్ కుమార్

సిరా న్యూస్, పిఠాపురం

2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిల‌పాల‌న్న‌దే ప్ర‌ధాన‌మంత్రి సంక‌ల్పం  చిలుకూరి రామ్ కుమార్ 

ప్ర‌జ‌లంద‌రి స‌హ‌కారంతో దేశాభివృద్ధి సాధించాల‌న్న‌ది న‌రేంద్ర‌మోడి ల‌క్ష్యమని,
దేశ ప్ర‌జ‌లంద‌రి స‌హ‌కారంతో భార‌త్‌ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాల‌న్న సంక‌ల్పంతోనే దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడి పనిచేస్తున్నార‌ని కాకినాడ జిల్లా అధ్యక్షులు బీజేపీ చిలుకూరి రామ్ కుమార్ తెలిపారు. దేశంలోని ప్ర‌తి వ్య‌క్తిలో, ప్ర‌తి గ్రామంలో ప్ర‌తి కుటుంబంలో కొత్త ఉత్సాహం తీసుకురావ‌డం ద్వారా అభివృద్ది చెందిన దేశంగా తీసుకురావ‌డ‌మే ముఖ్య ఉద్దేశ్య‌మ‌న్నారు. అంద‌రి తోడుతో అంద‌రి అభివృద్ధి సాధిస్తూ అంద‌రి విశ్వాసం(స‌బ్ కా సాత్‌, స‌బ్ కా వికాస్‌, స‌బ్ కా విశ్వాస్‌) పొందాల‌న్న‌ది ప్ర‌ధాన‌మంత్రి మోదీ ముఖ్య ఉద్దేశ్య‌మ‌ని పేర్కొన్నారు. కేంద్ర ప్ర‌భుత్వ స‌హాయంతో ప్ర‌జ‌ల‌కు అంద‌జేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌పై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించ‌డంతోపాటు వాటిని అర్హులైన వారికి నూరుశాతం అందించే ల‌క్ష్యంతో ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కాకినాడ జిల్లా పిఠాపురం రూరల్ మండలం, రాయవరం గ్రామంలో నిర్వహించారు.కేంద్రం అమలు చేస్తున్న పథకాలను వివరించిన అనంతరం రామ్ కుమార్ అర్హులకు ఆయుష్మాన్ భవ కార్డులను అందజేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *