Vedma Bojju Patel:గోడం నాగోరావ్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

సిరాన్యూస్‌, ఇంద్రవెల్లి :
గోడం నాగోరావ్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

ఆదిలాబాద్ జిల్లా ఇంద్ర‌వెల్లి మండలంలోని హీరాపూర్ మాజీ సర్పంచ్ గోడం నాగోరావ్ సోమవారం గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మంగళవారం వారి మారుతిగూడా గ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. గోడం నాగోరావ్ అకాల మరణం యావత్ సమాజానికి తీరని లోటని అన్నారు.సర్పంచ్ గా అయన ప్రజలకు చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. అనంతరం కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *