ఏలూరులో కానరాని పారిశుధ్యం
డంపింగ్ యాడ్ లను తలపిస్తున్న పలు ప్రాంతాలు
సిరా న్యూస్,ఏలూరు;
నాగేంద్ర కాలనీ, చెంచు కాలనీ, లంబాడి పేట వెళ్లే ప్రధాన రహదారి పక్కనే డంపింగ్ యార్డ్ ల చెత్త పేరుకు పోయింది. ఆ చుట్టుపక్కల నివసించే ప్రజలు ఈ చెత్త వల్ల ఎన్ని రోగాలు వస్తాయో అని భయపడుతూ జీవిస్తున్నామని తెలియజేస్తున్నారు. మురికి కాలంలోనే కాకుండా , కృష్ణ కాలువలో కూడా చెత్త పేరుకుపోవడంతో దోమలు విపరీతంగా పెరిగిపోవడం, అందులోనే మురికి నీరు కూడా కలిసిపోవడంతో దుర్వాసన వస్తుందని ప్రజలు గగోలు పెడుతున్నారు.అలాగే తూర్పు వీధి గంగానమ్మ గుడి ప్రాంతాల్లో కూడా చెత్త విపరీతంగా పెరిగిపోవడం వల్ల ప్రజలు ఏ రోగాలు వస్తాయో, ఏ వైరస్ లు వస్తాయో అని
భయపడుతూ జీవిస్తున్నామని. ఏలూరు వన్ టౌన్ ప్రాంతనికే ముఖ్యమైనది మెయిన్ బజార్ బిర్లాభం సెంటర్ అక్కడ గత కొన్ని నెలలుగా కాలువపై ఉన్న రాళ్లను తొలగించారు కానీ ఇప్పటికీ ఆ పని పూర్తి చేయకుండా అలాగే వదిలేయడంతో ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల నుండి ప్రజలు వారికి కావలసిన నిత్యవసర వస్తువులను కొనుగోలు చేయడానికి ప్రతిరోజు ఈ ఏరియాకి వస్తారు కానీ ఈ కాలువపై రాళ్లు తొలగించడంతో వాహనదారులు, పాదచారులు చాలా ఇబ్బంది పడుతున్నామని.దీనిపై జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ దుష్టుసారించి ఏలూరులో పారిశుద్ధ్యన్ని చక్కదిద్దుతారని ప్రజలు కోరుకుంటున్నారు