సిరాన్యూస్, నిర్మల్
కూచిపూడి నృత్య ప్రదర్శనలో గణన రెడ్డి, హజ రెడ్డి
భాగ్యనగరంలో రవీంద్రభారతిలో భారత్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో జరిగిన జైహో తెలంగాణ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం బీరవెళ్లి గ్రామానికి చెందిన అక్క చెళ్ళలు గణన రెడ్డీ, హజ రెడ్డీ ఇద్దరు కూచిపూడి నృత్య ప్రదర్శన చేపట్టారు.ఈ కాలంలో విదేశీ సంస్కృతి ఉన్న విలువలు మన దేశ సంస్కృతి పై లేదు అని చెప్పుకునే స్థాయిలో నేడు మనం ఉన్నాం. కానీ మన ఈ చిన్నారులు వేసవి సెలవుల్లో అంతరించి పోతున్న మన సంప్రదాయాలు , కళాలు నుండి ఒక్కటైన కూచిపూడి నృత్య నేర్చుకోవడం తో పాటు స్టేజ్ పర్ఫామెన్స్ ఇవ్వడం చాలా గొప్ప విషయం. ఇంత తక్కువ సమయంలో ఇలా నేర్చుకోవడం వారికి ఉన్న పట్టుదల ,నిబద్దత కి నిదర్శనం. వారి తల్లిదండ్రులు ప్రోత్సాహం అందించడం అనేది ఎంతో ముఖ్యం అని చెప్పాలి. ఇలా చిన్నారులను వారి అభిరుచులకు అనుగుణంగా తల్లి తండ్రులు ప్రోత్సహించడం శుభ పరిణామం.