సిరాన్యూస్, బోథ్
మెస్రం నిరూపమకు లాప్ టాప్ అందజేత
ఆదిలాబాద్ జిల్లా సోనాల మండలంలోని పార్ధి (కే ) గ్రామానికి చెందిన మెస్రం. భూమన్న కూతురు మెస్రం. నిరుపమ గత సంవత్సరం ఐఐఐటీ లో సీటు వచ్చింది.అయితే ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి దరఖాస్తు చేయడంతో మంగళవారం ఐటీడీఏ డీడీ డిప్యూటీ డైరెక్టర్ దిలీప్ కుమార్ తన ఛాంబర్లో మెస్రం.నిరూపమకు లాప్ టాప్ అందజేశారు.ఆదివాసులు ఉన్నత చదువులు చదివి,అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆయన కోరారు.