సిరాన్యూస్, బేల
వర్షాలు కురవాలని ఆగ్రో ఎంప్లాయిస్ సొసైటీ సభ్యుల పూజలు
వర్షాలు సమృద్ధిగా కురవాలని పంటలు బాగా పండి రైతులు సంతోషంగా ఉండాలని కోరుతూ మంగళవారం ఆదిలాబాద్ జిల్లా
బేల మండలంలోని ఆగ్రో ఎంప్లాయిస్ సొసైటీ ఆధ్వర్యంలో కప్పతల్లికి గంగబిషేకం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు అనిల్ గూండావార్ మాట్లాడుతూ ఈ సంవత్సరం బాగా వర్షాలు కురవాలని, అన్నదాతలు సంతోషంగా ఉండాలని పూజలు చేపట్టామని తెలిపారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో ఆగ్రో ఎంప్లాయిస్ సీడ్స్, ఫెస్టిసైడ్స్ షాప్ యజమానులు , ప్రణయ్ తాతవార్, మాజీ సర్పంచ్ దేవన్న , నిలేష్ గుండావార్, అడానేశ్వర్ ఫౌండేషన్ చైర్మన్ సతీష్ పవార్, దినేష్ బోయేర్ తది తరులు పాల్గొన్నారు.