సిరాన్యూస్, హుజురాబాద్
బస్సుల ఫిట్నెస్ ను తనిఖీ చేయాలి: ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారపు వెంకటేష్
* మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కి వినతి పత్రం అందజేత
హుజురాబాద్ నియోజకవర్గంలోని ప్రైవేటు పాఠశాలల,డిగ్రీ కళాశాలల బస్సుల ఫిట్నెస్ ను తనిఖీ చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారపు వెంకటేష్ అన్నారు. మంగళవారం హుజురాబాద్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కంచె వేణు కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజురాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రైవేట్ పాఠశాలల, డిగ్రీ కళాశాలలో బస్సులు రవాణా శాఖ నిబంధనలు పాటించడం లేదని, బస్సులలో పరిమితికి మించి విద్యార్థులను ఎక్కిస్తున్నారు. బస్సు కిటికీలకి గ్రిల్స్ పెట్టకుండా, బస్సుల్లో ఫైర్ సేఫ్టీ, ఫాస్టడ్ కీట్, క్లీనర్లను ఉంచకుండా విద్యార్థులను తీసుకెళ్తున్నారని, ఇలా నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆరోపించారు. వెంటనే ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రైవేటు పాఠశాలల, డిగ్రీ కళాశాలల బస్సులను ఫిట్నెస్ తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే డ్రైవర్ల లైసెన్స్ లను తనిఖీ చేయాలని అన్నారు. దాదాపు హైదరాబాదులో 30 బస్సులకు పైగా ఉంటాయని, అందులో ఫిట్నెస్ లేని బస్సులను గుర్తించి వాటిని సీజ్ చేసి ఆయా ప్రైవేటు పాఠశాలల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి కేశబోయిన రాము యాదవ్, ఏఐఎస్ఎఫ్ మండల సహాయ కార్యదర్శి రాపేల్లి రోహిత్, లంక దాసరి రాహుల్, అభిలాష తదితరులు పాల్గొన్నారు.