సిరా న్యూస్,తొర్రూరు;
పిచ్చికుక్క దాడిలో 45 రోజుల చిన్న బాబు మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మడిపెల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్థుల తెలిపిన కథనం ప్రకారం..
తొర్రూరు మండలం మడిపల్లి గ్రామానికి చెందిన నకిరేకంటి ముత్తయ్య, ఉప్పలమ్మ దంపతుల కుమార్తె రేణుకకు నెల్లికుదురు మండలం చెట్ల ముప్పారం గ్రామానికి చెందిన వెంకన్నతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. ఈ క్రమంలో వారికి మొదటి సంతానం బాబు పుట్టి అనారోగ్యంతో మృతి చెందగా, రెండో సంతానం లో బాబు జన్మించాడు. మూడవ సంతానంలో జన్మించిన 45 రోజుల బాబును ఇంటి ఆరుబయట మంచంలో పడుకోబెట్టి ఇంట్లో గ్యాస్ పై ఉన్న వంటను చూడడానికి వెళ్లింది. ఇంట్లో నుంచి బయటకు వస్తుండగానే పిచ్చికుక్క బాబును ఎత్తుకెళ్లింది.తీవ్రంగా గాయపడిన చిన్న బాబును వరంగల్ ఎంజీఎం తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. రాత్రి మృతి చెందాడు. దీంతో మడిపెళ్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
==========