Payal Shankar: రేవంత్‌రెడ్డిని క‌లిసిన ఎమ్మెల్యే పాయ‌ల్ శంక‌ర్‌

సిరాన్యూస్,ఆదిలాబాద్‌
రేవంత్‌రెడ్డిని క‌లిసిన ఎమ్మెల్యే పాయ‌ల్ శంక‌ర్‌

హైదరాబాద్ తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భ‌ట్టి విక్రమార్కల‌ను బుధ‌వారం మ‌ర్యాద‌పూర్వ‌కంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయ‌ల్ శంక‌ర్ క‌లిశారు.ఈ సంద‌ర్భంగా ఆదిలాబాదులో పెండింగ్‌లో ఉన్నటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జి , చనాక కోరాట ప్రాజెక్ట్ భూసేకరణ నిధుల విడుదల గురించి, ఆదిలాబాద్ లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ను కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా (డీపీఆర్ ) ప్రతిపాదనలు పంపాలని ముఖ్యమంత్రి ని అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సిర్పూర్ కాగజ్‌న‌నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు , బీజేపీ నాయకులు అశోక్ ముస్తపూరే, సంగప్ప పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *