సిరాన్యూస్, ఆదిలాబాద్
2047 నాటికి సికిల్ సెల్ అనీమియా నిర్మూలన లక్ష్యం: ఎంపీపీ రమేశ్
సికిల్ సెల్ అనీమియా అనే ఈవ్యాధిని కేంద్రప్రభుత్వం , రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా 2047 వరకు నిర్మూలించడమే లక్ష్యమని ఎంపీపీ రమేశ్ అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా అంకొలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు రమేష్ ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా ట్రైబల్ గ్రామాలలో ఉన్న రక్త హీనతతో బాధపడుతున్న ప్రజలకు ఎనిమియా లక్షణాలు గుర్తించి అవగాహన కల్పించి, వారికి రక్తం ఎక్కించడం సరైన మందులను ఇచ్చి వారిని ఆరోగ్యవంతులుగా చేయడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో అంకొలి వైద్యులు డా.సర్ఫరాజ్ , మాజీ ఎంపీటీసీ రమణ,మాజీ ఏఎంసీ అధ్యక్షులు గంగయ్య, అంకొలి ప్రధానోపాధ్యాయులు కండి నర్సయ్య, ఆరోగ్య పర్యవేక్షలు బొమ్మెతసుభాష్, వసంత, మరసుకొల లక్ష్మీ బాయి, కొడప యశోద, ఆరోగ్య కార్యకర్తలు నల్ల ఈశ్వర్ రెడ్డి, ఈశ్వర్ దేవి, వేణుతాయి, ల్యాబ్ టెక్నిషన్ మడావి శ్రీనివాస్. ఆశాకార్యకర్తలు పద్మ, కవిత, కౌసేల్య, గోదావరి, ఉపాధ్యాయలు, విద్యార్థులు పాల్గొన్నారు.