సిరాన్యూస్, ఆదిలాబాద్
భారత కాంగ్రెస్ ఆశాకిరణం రాహుల్ గాంధీ: కంది శ్రీనివాస రెడ్డి
* ప్రజా సేవా భవన్ లో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
* పెద్ద సంఖ్యలో హాజరైన కాంగ్రెస్ శ్రేణులు
* భారీ కేక్ కట్ చేసి సంబరాలు
భారత కాంగ్రెస్ ఆశాకిరణం రాహుల్ గాంధీ అని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి అన్నారు.త్వరలో దేశ ప్రధాని కూడా కాబోతారని ధీమా వ్యక్తం చేసారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. దీంతో పండగ వాతావరణం కనిపించిది.పెద్ద ఎత్తున హాజరైన కాంగ్రెస్ శ్రేణుల మధ్య భారీ కేక్ కట్ చేసి ఒకరికొరు తినిపించికొని రాహుల్ గాంధీ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం కంది శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ కుటుంబానికి నేడు పండగ రోజన్నారు.అనేక త్యాగాలు చేసిన కుటుంబంలో జన్మించిన గొప్పనాయకుడని కొనియాడారు. ఆయన చేసిన సాహసోపేత మైన భారత్ జోడో యాత్ర,భారత్ న్యాయ యాత్ర చరిత్రలో నిలిచి పోతాయన్నారు.ఈయాత్రల ద్వారానే కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకుందని తెలిపారు. దీంతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని శాసించే స్థితికి ఇండియా కూటమి..నిలిచిందన్నారు. దాని ఫలితంగా బీజేపీ రెండు ప్రాంతీయ పార్టీల సహకారంతో కేంద్రంలో అధికారాన్ని చేపట్టాల్సి వచ్చిందని ఇదెప్పుడైనా కూలిపోయే అవాశముందని అన్నారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీలో సరికొత్త జోష్ నింపాయన్నారు.సంపన్న కుటుంబంలో పుట్టిన్నప్పటికీ ఆయన అనేక సవాళ్లను ఎదుర్కొన్నారన్నారు. ఎన్నివిమర్శలొచ్చినా రాహుల్ ఏ దశలోనూ వెనకడుగు వేయలేదని బీజేపీ విమర్శలపుట్టినా ..ఆయన తనదైన మార్క్తో దేశ రాజకీయాల్లో కీలక శక్తిగా అవతరించారన్నారు. సర్వే సంస్థలు కూడా అంచనా వేయని రీతిలో లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమి గణనీయ సంఖ్యలో సీట్లు సాధించడం వెనుక రాహుల్ శ్రమ, వ్యూహాలు ఉన్నాయన్నారు. అటు దేశంలోనే కాకుండా ఇటు ఆదిలాబాద్ లోను కాంగ్రెస్ పార్టీ గతంలోకంటే కూడా మెరుగైన స్థితిలో ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికలలో మైనస్ ఉన్న ఓట్ బ్యాంకును ప్లస్ గా మల్చడంతో పాటు ఎన్నడు లేని విధంగా 48 వేల వరకు ఓట్లు సాధించగలిగామన్నారు.అనంతరం లోక్ సభ ఎన్నికలలో దీనిని 77 వేల వరకు తీసుకెళ్లగలిగినందుకు తనకు సంతోషంగా ఉందన్నారు. దీని వెనుక కాంగ్రెస్ శ్రేణుల కృషి అమోఘమన్నారు.వచ్చే ఎన్నికల నాటికి ఈ సంఖ్యను లక్ష దాటించాలన్నారు.అంతే కాకుండా గ్రామ పంచాయతీ , మండల పరిషత్ ,జిల్లా పరిషత్ , మున్సి పల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగించేలా అందరు కలసికట్టుగా పని చేయాలన్నారు.గెలుపే లక్ష్యంగా ముందడుగు వేయాలని పిలుపు నిచ్చారు. అనంతరం క్యాంపు ఆఫీస్ అప్ డేట్స్ క్యూ ఆర్ కోడ్ ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని నాయకులు , కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.