సిరాన్యూస్, చిగురుమామిడి
నిరుద్యోగ యువత కోసమే జాబ్ మేళా: కంది తిరుపతి రెడ్డి
మెగా జాబ్ మేళా పోస్టల్ ఆవిష్కరించిన కాంగ్రెస్ నాయకులు
బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో జూన్ 24న హుస్నాబాద్ పట్టణంలోని తిరుమల గార్డెన్స్ లో మెగా జాబ్ మేళ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కంది తిరుపతి రెడ్డి పేర్కొన్నారు. బుధవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో స్థానిక జడ్పీటీసీ గీకురు రవీందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి జాబ్ మేళా పోస్టర్ ను ఆవిష్కరించారు.జడ్పీటీసీ గీకురు రవీందర్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కోసం ఈ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందన్నారు. జూన్ 24న జరిగే జాబ్ మేళాలో వివిధ కంపెనీలు పాల్గొంటున్నాయని వీటి ద్వారా ఇక్కడ యువతకు 5 వేల ఉద్యోగాలు రానున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ల భవిష్యత్తుకు భరోసా కల్పించే దిశగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కంది తిరుపతిరెడ్డి మండల యువతకు విజ్ఞప్తి చేశారు.కార్యక్రమంలో జిల్లా, మండల నాయకులు చిట్టి మల్ల రవీందర్, దాసరి ప్రవీణ్ కుమార్ నేత, ఐరేడ్డి సత్యనారయణ, ఓరుగంటి భారతీదేవి, శాబొద్దిన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.