అభివృద్ది పనులు ఆగకూడదు

సిరా న్యూస్,రంగారెడ్డి;
కూకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అధికారులతో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమావేశం నిర్వహించారు. అధికారులతో మాట్లాడుతూ గత ఆరు నెలలుగా ఎలాంటి అభివృద్ధి జరగకుండా పెండింగ్లో ఉన్న పనులను సైతం పట్టించుకోకుండా అధికారులు వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా వేల కోట్ల రూపాయలతో కూకట్పల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని అభివృద్ధిలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా అందరి సహకారంతో ట్రాఫిక్ సమస్యలను డ్రైనేజీ సమస్యలను మంచినీటి సమస్యలను నిర్మూలించామన్నారు.ప్రభుత్వం మారిన ఆరు నెలల్లో ఎలాంటి అభివృద్ధి పనులు జరగకపోగా గత సంవత్సరంలో 65 కోట్ల రూపాయలతో రోడ్లు డ్రైనేజీ మంచినీటి పైప్లైన్ లకు శంకుస్థాపనలు చేసి టెండర్లు జరిగిన అలాంటి పనులను పక్కన పెడుతున్నారని జిహెచ్ఎంసి అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి కొరకు ఎక్కడికి వెళ్లడానికైనా వెనకాడని  అభివృద్ధి కోసం పని చేస్తామన్నారు.
===============

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *