Thala Naresh: అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలి:  జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ల నరేష్

సిరాన్యూస్‌, సైదాపూర్:
అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలి: జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ల నరేష్
* త‌హ‌సీల్దార్‌కు విన‌తి ప‌త్రం అంద‌జేత‌

సైదాపూర్ మండలంలోని దుద్దెనపల్లి గ్రామంలో ఉన్నటువంటి పూరుకుంట నాలాను పునరుద్ధరించి అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని ధర్మసమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ల నరేష్ అన్నారు. గురువారం సైదాపూర్ మండల తహసీల్దార్ దూలం మంజుల కి ధర్మసమాజ్ పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ల నరేష్ మాట్లాడుతూ దుద్దెనపల్లి గ్రామంలో ఉన్న పూరుకుంట మత్తడి నుంచి నాలా ద్వారా వెళ్ళవలసిన వరద నీరు అక్రమ కట్టడాల వలన మలుపు తీసుకుని, దళిత నిరుపేద రైతులైన బోరగల్ల వెంకటయ్య, కొమ్ముల కొమురయ్య ల పట్టా భూమిలోని (సర్వే నంబర్ 383,384) కి చేరి వారికి తీవ్ర నష్టం కలుగుతుందని తెలిపారు. మండల గ్రామరెవెన్యూ రికార్డులో ఉన్న నక్ష ప్రకారం నాలాను పునరుద్ధరించి వరద నీరుని చెరులోకి వెళ్లే విధంగా చర్యలు తీసుకొని నష్టపోతున్న రైతులకు న్యాయం చేయాలని కోరారు.  కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గ నాయకులు బోయిని సదన్ మహరాజ్, సైదాపూర్ మండలం నాయకులు తిప్పారపు రమేష్, మొలుగూరి భూపతి, మేకల ఎల్లన్న, బొరగాళ్ల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *