SonKamble Gopinath: ప్రతి రోజు యోగ చేద్దాం.. ఒత్తిడిని తగ్గించుకుందాం : బయోడైవర్సిటీ బోర్డు కో-ఆర్డినేటర్ సోన్ కాంబ్లే గోపినాథ్

సిరాన్యూస్‌, ఇంద్రవెల్లి
ప్రతి రోజు యోగ చేద్దాం.. ఒత్తిడిని తగ్గించుకుందాం : బయోడైవర్సిటీ బోర్డు కో-ఆర్డినేటర్ సోన్ కాంబ్లే గోపినాథ్

నేటి వేగమంతమైన జీవితంలో ప్రతి రోజు యోగా చేయడం చాలా ముఖ్యమైనదని బయోడైవర్సిటీ బోర్డ్ ఉమ్మడి జిల్లా కో-ఆర్డినేటర్ సోన్ కాంబ్లే గోపినాథ్ అన్నారు.శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో తెలంగాణ బయోడైవర్సిటీ బోర్డ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  ప్రతిరోజు యోగా చేయడం ద్వారా మనిషి ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆరోగ్యకరమైన జీవనాన్ని గడపవచ్చని అన్నారు. అనేక వ్యాధులకు దూరంగా ఉంటామని తెలిపారు. మనిషికి బాధ్యతలు పెరిగే కొద్దీ ఒకరకమైన అసహానానీకి గురువుతారని తెలిపారు. దీని వల్ల కలిగే ఒత్తిడి ఒకానొక దశలో మనల్ని మానసికంగా కొంగదీస్తుందని పేర్కొన్నారు. యోగ చేయడం ద్వారా అనేక లాభాలు కలుగుతాయని అన్నారు. మన దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాది జూన్ 21వ తేదిన యోగ దినోత్సవంను జరుపుకొంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *