సిరాన్యూస్, కళ్యాణ్ దుర్గం
రాజమ్మ పార్థివ దేహానికి నివాళులర్పించిన పాలబండ్ల శ్రీరాములు
కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం మండలం ఎరడికేర గ్రామానికి చెందిన ఎంపీటీసీ మారుతమ్మ అత్త రాజమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆదేశాల మేరకు టీడీపీ బ్రహ్మసముద్రం మండల కన్వీనర్ పాలబండ్ల శ్రీరాములు ఎరడికెర గ్రామానికి చేరుకుని రాజమ్మ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ ఎల్లవేళల కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు రామకృష్ణ, గురుసిద్ద, మూర్తి, తిప్పేస్వామి, వెంకటేసులు, తిమ్మప్ప , మల్లేష్, నాగరాజు, అజ్జప్ప, నాగరాజు, మారెప్ప,శివప్రసాద్, ఎరడికేర టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు