సిరాన్యూస్, చిగురుమామిడి
పాఠ్యపుస్తకాలలో జయశంకర్ జీవిత చరిత్రను చేర్చాలి: శ్రీరామోజు రాజ్ కుమార్
* ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి
పాఠ్యపుస్తకాలలో జయశంకర్ జీవిత చరిత్రను చేర్చాలని విశ్వబ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షుడు శ్రీరామోజు రాజ్ కుమార్ అన్నారు.తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ 13వ వర్ధంతిని కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జయశంకర్ సార్ చిత్రపటానికి విశ్వకర్మ నాయకులు, పలు కుల సంఘాల నాయకులు పూలమాలు వేసి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షుడు శ్రీరామోజు రాజ్ కుమార్ మాట్లాడుతూ ఆచార్య జయశంకర్ సార్ చిన్నతనం నుండి అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తిని కొనియాడారు. తన తుదిశ్వాస తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పాటుపడ్డాడన్నారు. ఇలాంటి మహోన్నత వ్యక్తి గురించి ముందు తరాలకు తెరవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వం ప్రతి మండల కేంద్రంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా పాఠ్యపుస్తకాలలో ఆయన జీవిత చరిత్రను చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి సదాచారి, విశ్వబ్రాహ్మణ ముఖ్య బాధ్యులు అనువోజు బాలకృష్ణ ఆచారి, దంచనోజు సదానందచారి, కందుకూరి శ్రీనివాస్, చిగురుమామిడి గ్రామ అధ్యక్షులు పోలోజు సదాచారి, సుందరగిరి అధ్యక్షులు రాంపేల్లి వెంకటచారి, సంఘ బాధ్యులు అనువోజు చిరంజీవి, గొల్లపెల్లి తిరుపతి, వెంకన్న, శ్రీనివాస్, రాజయ్య, పెనుకుల తిరుపతి, వెంకన్న, సత్తయ్య, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.