సిరా న్యూస్,పార్వతీపురం మన్యం;
జిల్లా ఎస్పీ కార్యాలయానికి సమీపంలో దొంగలు భీభత్సం సృష్టించారు. ఇంట్లో ఉన్న మహిళ మెడ పైన కత్తి పెట్టి బెదిరించి దోపిడీ చేసారు. వై.కె.యం కాలనీలో గల శాంబన రాణి అనే మహిళ ఇంట్లో గుర్తు తెలియని దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. దాదాపు 13 తులాల బంగారం, 70 వేల నగదు వెండి వస్తువులను అపహరించారు. బాధితురాలు 100 కు కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనలో స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు.