బంగారం షాపు దొపిడీ

దుండగులను పట్టుకోవాడానికి ప్రత్యేక బృందాలు
 సిరా న్యూస్,మేడ్చల్;
దొంగతనానికి పాల్పడ్డ దుండగులను తొందర్లోనే పట్టుకుంటామని మేడ్చల్ డిసిపి కోటిరెడ్డి అన్నారు. శుక్రవారం మేడ్చల్ డిసిపి గా కోటిరెడ్డి పదవి బాధ్యతలు చేపట్టారు. అనంతరం మేడ్చల్ పట్టణంలో శ్రీ జగదాంబ జువెలరీస్ లో నగల వ్యాపారిపై దుండగులు కత్తితో దాడి చేసి నగల చోరీకి ప్రయత్నించిన సంఘటన స్థలాన్ని మేడ్చల్ ఏసిపి శ్రీనివాస్ రెడ్డి ,సిఐ సత్యనారాయణతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దుండగులను పట్టుకోవడానికి ప్రత్యేకమైన బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దుండగులకు సంబంధించిన పలు కీలక ఆధారాలు కూడా సేకరించినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు అమర్చుకోవాలని తద్వారా సీసీ కెమెరాలు నేరస్తులను పట్టుకోవడం ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. రాబరీ కేసు కింద కేసు నమోదు చేసినట్లు డిసిపి చెప్పారు.
======

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *