సిరా న్యూస్,తాడేపల్లిగూడెం:
తొలిసారి అసెంబ్లీలో అడిగిడుతున్న తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టితో పవన్
ప్రజలు ఎన్నో ఆశలు ఆకాంక్షలతో కూటమి ప్రభుత్వానికి అఖండ మెజారిటీ ఇచ్చి మనల్ని అసెంబ్లీలోకి పంపారని వారి ఆశలు ఆకాంక్షలు నెరవేర్చే విధంగా పనిచేయాలని తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తో జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అమరావతిలోని అసెంబ్లీ ఆవరణలో శుక్రవారం తొలిసారి అసెంబ్లీకి అడుగెడుతున్న సందర్భంలో బొలిశెట్టితో పవన్ కళ్యాణ్ పై విధంగా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రజల సమస్యలు, వారి అభివృద్ధి,. నియోజకవర్గ సర్వతో ముఖాభివృద్ధికి పాటుపడతానంటూ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు మెచ్చుకునే విధంగా పాలన సాగిద్దాం నడండి అంటూ పవన్ కళ్యాణ్ కూటమి ఎమ్మెల్యేలను కలుపుకుని అసెంబ్లీలోకి ప్రవేశించారు.