Paidipelli Srinivas Goud: సంపూర్ణ ఆరోగ్యం ..యోగ ద్వారానే సాధ్యం:  బీజేపీ మండలాధ్యక్షుడు పైడిపెల్లి శ్రీనివాస్ గౌడ్

సిరాన్యూస్, చిగురుమామిడి
సంపూర్ణ ఆరోగ్యం ..యోగ ద్వారానే సాధ్యం:  బీజేపీ మండలాధ్యక్షుడు పైడిపెల్లి శ్రీనివాస్ గౌడ్

సంపూర్ణ ఆరోగ్యం ..యోగ ద్వారానే సాధ్యమ‌ని బీజేపీ మండలాధ్యక్షుడు పైడిపెల్లి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా శుక్ర‌వారం చిగురుమామిడి మండల కేంద్రంలో బీసీ వెల్ఫేర్ హాస్టల్ ముందు వివిధ గ్రామల ప్రజలు కలిసి యోగ ఆసనాలు,సూర్యనమస్కారాలు చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడలు పైడిపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ 2014 సెప్టెంబర్ 27వ తేదిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ యోగ ను అంతర్జాతీయంగా జరుపుకోవాలని ఒక తీర్మానం ప్రవేశపెట్టారని తెలిపారు. భారత దేశానికి మాత్రమే తెలిసిన యోగ విశిష్టతను ప్రపంచం మొత్తానికి పరిచయం చేసిన వ్యక్తి మన ప్రధానమంత్రి మోదీ అని ప్రశంసించారు. ఆయన కృషి మరువలేనిదని అన్నారు.ఈ కార్యక్రమంలో ముదిమానిక్యం మాజీ సర్పంచ్ అచ్చ రవీందర్, ముంజ చంద్రయ్య, చిగురుమామిడి గ్రామ పాలకేంద్రం చైర్మన్ పన్యాల శ్రీధర్ రెడ్డి, బొమ్మనపెల్లి గ్రామ పాలకేంద్రం మాజీ చైర్మన్ కంది శంకర్, పెనుకుల సంపత్, మండల విశ్వకర్మ నాయకులు గొల్లపెల్లి సదాచారి, శ్యామకూర చెంద్ర శేఖర్ , మకుటం సంపత్,వెంకన్న, గూళ్ల సంపత్, జెరిపోతుల కుమార్, సంపత్, అజయ్, ప్రణయ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *