Sandhya Rani: బస్టాండ్ బడి ప్రారంభం:  హెచ్ఎం సంధ్యారాణి

సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
బస్టాండ్ బడి ప్రారంభం:  హెచ్ఎం సంధ్యారాణి

నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో గల పాత బస్టాండ్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా పాఠశాలను కాంప్లెక్స్ హెచ్ఎం సంధ్యారాణి ప్రత్యేక పూజలు చేసి తరగతులను ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లోని అర్హులైన ఉపాధ్యాయుల ద్వారా నాణ్యమైన విద్య అందుతుందని తెలిపారు. ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫాములను ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు. రుచికరమైన మధ్యాహ్న భోజనం ఇతర అన్ని వసతులు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఉపాధ్యాయులు కారింగుల వెంకటేశ్వర్లు, రిటైర్డ్ ఎంఈఓ కాజా, రిటైర్డ్ ఏఎస్ఐ ఇస్మాయిల్, సిఆర్పిలు కవిత, నోమాని, కాలనీవాసులు జియా, షాకీర్, అజార్ తదితరులు, పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *