వైకాపా కార్యాలయాన్ని కూల్చివేసిన సీఆర్డీయే

సిరా న్యూస్,తాడేపల్లి;
తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని సిఆర్డీయే అధికారులు కూల్చివేశారు. ఉదయం 5:30 గంటల సమయంలో కూల్చివేతల ప్రారంభించారు. పొక్లైన్లు, బుల్డోజర్లతో శ్లాబ్కు సిద్ధంగా ఉన్న భవనాన్ని యుద్ధ ప్రాతిపదికన అధికారులు కూల్చి వేస్తున్నారు. కూల్చివేతకు సీఆర్డీయే ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ను సవాల్చేస్తూ శుక్రవారం హైకోర్టును వైయస్సార్సీపీ నేతలు ఆశ్రయించారు. చట్టాన్ని మీరి వ్యవహరించ వద్దని హైకోర్టు ఆదేశించినా వాటిని బేఖాతరు చేస్తూ చర్యలు తీసుకోవడం పై వైయస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం కక్ష సాధింపు కోసమే ఈ చర్యకు పాల్పడతారని, అధికారుల తీరుపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *