సిరా న్యూస్, ఆదిలాబాద్
ఇజ్జగిరి నరసింహులు కుటుంబాన్నిపరామర్శించిన ముడుపు ప్రభాకర్ రెడ్డి
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్లో జవాన్గా పని చేస్తున్న ఇజ్జగిరి నరసింహులు శుక్రవారం మధ్యాహ్నం గుండెపోటుతో మృతి చెందారు. ఈవిషయం తెలుసుకున్న సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి శనివారం వారి ఇంటి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వాళ్ళ తమ్ముడు పంచాయతీ కార్యదర్శి ఇజ్జగిరి రాందాస్, నరసింహులు భార్య కొరియాల, కుటుంబ సభ్యుల్ని కలిసి ధైర్యంగా ఉండాలని చెప్పారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. ప్రభాకర్ రెడ్డి వెంట సీపీఐ జిల్లా నాయకులు, జిల్లా కార్యదర్శి బెజ్జంకి నర్సింగ్ రావు, జిల్లా అధ్యక్షులు ఖండాల గణేష్, అర్లీ బి సిపిఐ కార్యదర్శి సాగర్, సల్మాన్ తదితరులు ఉన్నారు.