సిరా న్యూస్,సంగారెడ్డి;
పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో జరిగిన సోదాలపై ఈడీ ప్రకటన చేసింది. మైనింగ్ పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. మనీలాండరింగ్, హవాలా నేపథ్యంలో సోదాలు చేసాం. సంతోష్ స్యాండ్, సంతోష్ గ్రానైట్ కంపెనీల ద్వారా అక్రమాలు, రూ.300 కోట్లలో మైనింగ్ అక్రమాలు జరిగినట్లు గుర్తించాం. ప్రభుత్వానికి రూ.39 కోట్లు నష్టం చేకూర్చారు. బ్యాంక్ అకౌంట్లలో అక్రమ లావాదేవీలను గుర్తించామని ప్రకటనలో పేర్కోంది.
అక్రమ మార్గంలో డబ్బు మొత్తాన్ని రియల్ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టారు. సోదాలు సందర్బంగా రూ.19 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నాం. బినామీ పేర్లతో లావీదేవీలను గుర్తించాం. కొన్ని బ్యాంక్ లాకర్స్ను ఇంకా తెరవాల్సి ఉంది. మధుసూదన్ రెడ్డి, మహిపాల్ రెడ్డికి పలువురు బినామీలుగా ఉన్నారు. వాళ్ళను కూడా విచారణ చేస్తామని ఈటీ వివరించింది.
=======