boath: పట్టుబడిన లారీ, ఇసుక మాయం

సిరా న్యూస్, బోథ్‌
పట్టుబడిన లారీ, ఇసుక మాయం
ప‌ట్టించుకోని పోలీసు, మైనింగ్ అధికారులు

ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రం సమీపంలోని పొచ్చెర క్రాస్ రోడ్ వద్ద గత నాలుగు రోజుల క్రితం స్థానిక ప్రజలు ఓవర్ లోడ్ తో ఎటువంటి పనులు చెల్లించకుండా వచ్చిన లారీని పోలీసులకు, మైనింగ్ అధికారులకు సమాచారం ఇచ్చి పట్టించారు. అయితే పట్టుబడిన లారీ నుండి డ్రైవర్ అదే రాత్రి ప‌రార‌య్యారు. అక్కడికి చేరుకున్న పోలీస్ మైనింగ్ అధికారులు లారీని పోలీస్ స్టేషన్ కు తరలించేందుకు ప్రయత్నించారు. డ్రైవర్ లేకపోవడంతో లారీని అక్కడే విడిచి పోవడంతో ఇసుక లారీ పట్టుబడిన తెల్లవారు జామున లారీని అక్కడినుండి తరలించుకు వెళ్లారు. లారీ ఎటు పోయిందనే సమాచారం పోలీసులు గానీ, మైనింగ్ అధికారులు కానీ తెలుపకపోగా, తాజాగా శుక్రవారం తెల్లవారుజామున పట్టుబడిన ఇసుక లారీలో నుండి ఖాళీ అయిన ఇసుకను తీసుకువెళ్లారు. పట్టుబడిన ఇసుకను మైనింగ్ అధికారులు పోలీసు అధికారులు అక్కడి నుండి తరలించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇసుక మాయమైందని స్థానికులు అంటున్నారు. ఏది ఏమైనా స్థానికులు పట్టించి ఇచ్చిన ఇసుక లారీ అందులోనుండి కుప్పగా వేసిన ఇసుక మాయం కావడంతో అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు. అధికారుల పాత్ర ఉండటం తోపాటు మామూలుగా తీసుకోవడంతో ఇసుక తరలిపోయిందని పలువురు పేర్కొంటున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *