సిరా న్యూస్, ఖానాపూర్ టౌన్
ఖానాపూర్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో అభివృద్ధి కమిటీ సర్వే
30శాతం నివాసం ఉండని ఇండ్లు
* నివాసం ఉండని లబ్దిదారులను అనర్హులుగా గుర్తించాలి
అనేక సంవత్సరాల పోరాటా ఫలితంగా ఖానాపూర్ చౌరస్తా వద్ద 400వందల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించారు. అయితే లక్కీ డ్రా లో లబ్ధిదారులు గా ఉన్నటువంటి వారు వారికి కేటాయించిన ఇండ్లలో 30శాతంనివాసం ఉండటం లేదు. నివాసం ఉంటున్నటువంటి వారికి అనేక సమస్యలు ఎదురవుతున్నాయి . శనివారం నిర్మల్ ఖానాపూర్ డబుల్ బెడ్ రూమ్ అభివృద్ధి కమిటీ ప్రజల సమక్షంలో 400ఇండ్లు తనిఖీ చేశారు. ఈ విచారణ లో 30శాతానికి పైగా ఇండ్లలో ఉండటం లేదు. అనర్హులు కూడా కొందరు ఉన్నట్లు తేలింది. జిల్లా కలెక్టర్, మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని అభివృద్ధి కమిటీ సభ్యులు కోరారు. అలాగే డబులు బెడ్ రూం కాలనీలో అనేక సమస్యలు ఉన్న ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పూర్తి స్థాయిలో రోడ్ల నిర్మాణం చేపట్టాలని తెలిపారు. బస్టాండ్ నిర్మాణం, పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, హాస్పిటల్, పార్క్, మందిరం మజీద్ టవర్, పోలీస్ స్టేషన్, డంపింగ్ యార్డ్, కమిటీ హాల్ , శ్మశాన వాటిక నిర్మాణం చేపట్టాలని కోరారు. మినీ వాటర్ ట్యాంక్ తక్షణమే ఏర్పాటు చేసి వాటర్ సమస్య లేకుండా చూడాలని, మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా కోసం కనెక్షన్ ఇవ్వాలని, అలాగే సెప్టిక్ ట్యాంక్ సరిపడా లేకపోవటం వల్ల ఇబ్బంది పడుతున్నారు. వెంటనే కాలనీ లోని సమస్యలు పరిష్కరించాలని పూర్తి స్థాయి విచారణ తరువాతనే ఇండ్ల పట్టాలు ఇవ్వాలని కోరారు. ప్రజా విచారణ లో భాగంగా అభివృద్ధి కమిటీ అధ్యక్షులు నంది రామయ్య ఉపాధ్యక్షులు దాదాబాయ్ ప్రధానకార్యదర్శి గోవింద్ నాయక్ ,కోశాధికారి కత్తుల శ్రీకాంత్ కమిటీ నాయకులు షేక్ అఖిల్, అప్సర్ ఖాన్ సురేష్, ఎస్, నర్సయ్య , బి,వర్మ సాయిచరణ్,గోరెబాయ్, వడ్లలచ్చన్న, భూమక్క, మహాబూబ్, ఫెరోస్ తదితరులు పాల్గొన్నారు.