సిరాన్యూస్, ఆదిలాబాద్
తప్పుడు వైద్య ధృవపత్రాలను గుర్తించండి: టీపీయూఎస్ జిల్లా అధ్యక్షులు సునీల్ చౌహాన్
* కలెక్టర్కు వినతి పత్రం అందజేత
2024 ఉపాధ్యాయ బదిలీలలో తప్పుడు వైద్య ధృవపత్రాలు, ప్రత్యేక క్యాటగిరి పాయింట్లు, స్పౌస్ కేటగిరి దరఖాస్తులను రీవెరిఫికేషన్ చేయాలని టీపీయూఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు సునీల్ చౌహాన్ అన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ రాజర్షిషాకు టీపీయూఎస్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ బదిలీలు పారదర్శకంగా జరపాలన్నారు. బదిలీల కోసం వైద్య ధ్భవ పత్రాలు సమర్పించిన దరఖాస్తులను అన్నింటిని కూడా పున పరిశీలించి నకిలీ వైద్య ధ్రువ పత్రాలను గుర్తించి జాబితా నుండి తొలగించి వారిపైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. స్పౌస్ కేటగిరిల లో కూడా 5/8 సం.లు నిండకుండానే మళ్ళీ దరఖాస్తు చేసుకొన్న వాటిని గుర్తించి జాబితా నుంచి తొలగించాలన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వలబోజు గోపి క్రిష్ణ పాల్గొన్నారు.