సిరాన్యూస్, ఆదిలాబాద్
జిల్లా మహాసభలను జయప్రదం చేయండి: ఎన్పీఆర్డీ జిల్లా అధ్యక్షులు మేస్రం నాగేష్
జూలై జరిగే వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఎన్పీఆర్డీ జిల్లా అధ్యక్షులు మేస్రం నాగేష్ అన్నారు. సీఐటీయూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అదిలాబాద్ జిల్లా ఎన్పిఆర్డి జిల్లా మహాసభలను జులై నెలలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. వికలాంగుల సమస్యలపై జిల్లా కలెక్టర్కి అనేక దఫాలుగా వినతి పత్రాలు అందజేశామని తెలిపారు. గత ప్రభుత్వం వికలాంగుల సమస్యలు పరిష్కరించలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ప్రతి నెల 1 తేదీ లోగా పింఛన్ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా కార్యదర్శి హరిపా బేగం, ఉపాధ్యక్షులు వజ్జల పోచన్న, జిల్లా సెక్రెటరీ చొక్కాపొట్లా పోచన్న జెంట్ సెక్రెటరీ సర్పే ప్రవీణ్, నాయకులు కొత్త పెళ్లి సత్యనారాయణ, రాగి యోగేష్, ఇమ్రాన్ కురిసే, అనసూయ బుచక్క మెహబూబా, మసురుద్, మారుబాయ్ తదితరులు పాల్గొన్నారు.