సిరాన్యూస్, బైంసా
అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న యోగేష్
* సేవే పరమావధి ముందుకెళ్తున్న యువకుడు
* 18సార్లు రక్తదానం
నేడు ఎవరు ఏమి జరుగితే మనకి ఎందుకు లే అనుకుంటాన్న నేటి రోజుల్లో సమాజ సేవలో నిరంతరం ముందు ఉంటూ అనాథులకు ఆప్తుడుగా నిలుస్తున్నాడు యోగేష్. నిర్మల్ జిల్లా బైంసాకు చెందిన యోగేష్ ఓ షాప్లో వర్కర్గా పని చేస్తూ పలువురికి అండగా నిలుస్తున్నాడు. ఆకలీ తో ఉన్న వారికి అన్నదానం తో వారి ఆకలి తీర్చే అన్నపూర్ణ పుత్రుడుగా, అతను అనాధగా మరణించిన మనుషుల శవాలకి కాటికాపరి అవుతాడుగా, గోవులకు,వానరాలు మరణిస్తే అంత్యక్రియలు చేస్తాడు. ఎందరో చిన్న పిల్లలకి నిమోనియా లాంటి వ్యాధి ఉన్న వారికి ఎందరికో అపన్న హస్తం అయ్యాడు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారు అంటే తమ సొంత వాళ్ల కంటే ఎక్కువ గా అందరినీ ప్రార్థించి ఆ కష్టాన్ని తరిమేస్తాడు. జీవితం ఒక పుస్తకమైతే.. ఖాళీగా వున్న మధ్యపేజీలన్నింటిని, మనం నవ్వులతో, సంతోషాలతో,పటిష్టమైన బంధాలు, అనుబంధాలతో, ప్రేమాభిమానాలతో, ఆత్మీయస్నేహాలతో ఆశయాలతో, విజయ వైభవాలతో నింపి జీవితపుస్తకాన్ని ఆసక్తికరంగా ప్రేరణాత్మకంగా ప్రతిఒక్కరూ చదివేలా ఆవిష్కరించుకోవాలి. అలా తనకు తాను ఆవిష్కరించుకొంటూ,రక్తం కావాలి అన్ని పిలుపుతో స్పందించి, రక్తదాత అక్కడికి చేరుకొనే వరకు ,ఆగకుండా శ్రమ సలుపుతూ, తాను ఆ కార్యంలో భాగమై,18 వ సారి రక్త దానం చేయడం తనకు చాల ఇష్టం. నిర్మల్ జిల్లాలోని ఎవరికి రక్తం అవసరం ఉంది అనగానే క్షణాల్లో నేనున్నాను అంటూ ముందుకు వచ్చి విశ్రమించకుండా పట్టు వదలని విక్రమార్కుల్లా వారి కష్టాన్ని తన కష్టంగా భావిస్తూ ఎంతోమందికి ఆదర్శమయ్యారు. ఇలాంటివారు సమాజంలో చాలా అరుదుగా కనిపిస్తారు. తను షాప్ ఒక వర్కర్ గా పనిచేస్తూ తన స్వలాభం కోసం కాకుండా అందరూ బాగుండాలి అనే తపనతో ముందుకు వెళ్తున్న యోగేష్ ని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.