సిరా న్యూస్,రంగారెడ్డి;
నార్సింగీ ఔటర్ రింగు రోడ్డు పై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఘటనలో ఇద్దరు బస్సు చక్రాల కింద నలిగారు. బస్సులో ప్రయాణిస్తున్న పలువురు కి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో 2 కిలోమీటర్ల మేరా ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్ నుండి ఔటర్ రింగు రోడ్డు మీదుగా ముంబాయి వెళుతున్న మార్నింగ్ స్టార్ బస్సు ప్రమాదానికి గురయింది. బస్సులో పలు కుటుంబాలు వున్నాయి.