సిరా న్యూస్,మేడ్చల్;
హైదరాబాద్ నాచారం లో తిరువూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు టిడిపి అభిమానులు అభినందన సభ ఏర్పాటు చేశారు . ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కొలికపూడీ శ్రీనివాసరావు హైదరాబాద్ రావడంతో నాచారంలో శేషగిరి రావు ఆధ్వర్యంలో టిడిపి అభిమానులు ఘన స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాసరావు అభిమానులతో కలిసి డ్యాన్స్ చేసి తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టిడిపి జనసేన బిజెపి కూటమి ఘన విజయం సాధించి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నూతన ప్రభుత్వం ఏర్పడి ఆంధ్రప్రదేశ్ అమరావతి పునర్మాణం అవుతుందన్నారు.
గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన నుండి ఆంధ్రప్రదేశ్ కాపాడే లక్ష్యంగా ఏదైతే పవన్ కళ్యాణ్ ఓట్లు చీలకూడదని లక్ష్యంతో రాజకీయంగా అన్ని సర్దుబాటు చేసుకొని కూటమి భారీ మెజార్టీతో 164 స్థానాలలో ఎమ్మెల్యేలతో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డదన్నారు.
ఈ నేపద్యంలో కూటమి ప్రభుత్వం ముందు స్పష్టమైన లక్ష్యాలు ఉన్నాయన్నారు. అమరావతి నిర్మాణం, పోలవరం నిర్మాణం పూర్తి లక్ష్యాలతో అన్ని ప్రాంతాల అభివృద్ధి అన్ని వర్గాల సంక్షేమం కోసం కూటమి పనులు చేస్తుందని తెలిపారు