అధికారులు స్పందించి పెండింగ్ వేతనాలు ఇప్పించాలి.
సిరా న్యూస్,మందమర్రి;
మంచిర్యాల జిల్లా మందమర్రి డివిజన్ పరిధిలోని జియం ఆఫీసు, కెకె ఓసి, ఏరియా వర్క్ షాప్, కాసీపేట, కెకె 5,రెస్క్యు ఆఫీసు, ఆర్ కె పి ఓసి లల్లో పనిచేస్తున్న కన్వేయన్స్ డ్రైవర్లు 2 నెలల పెండింగ్ వేతనాలు ఇవ్వాలని సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం (సిఐటియు) ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్లు ధరించి విధులు నిర్వహించడం జరిగింది. కన్వేయన్స్ డ్రైవర్లకు 2 నెలలుగా వేతనాలు లేక ఆర్థికంగా కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారింది. వేతనాల కోసం ఓనర్లను అడిగిన బిల్లులు అయితేనే ఇస్తామంటు నెలలు గడుపుతున్నారు. అధికారులకు మొరపెట్టుకున్న ఫలితం లేకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. బిల్లులతో సంబంధం లేకుండా కార్మికులకు ప్రతి నెలా 7వ తేదిన వేతనాలు ఇవ్వాలని యాజమాన్యం సర్క్యులర్ ఇచ్చిన ఆచరణలో మాత్రం అమలు కావడం లేదు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి నెల వేతనాలు వచ్చిన పెరిగిన ధరలకు వచ్చే జీతం ఏ మూలకు సరిపోవడం లేదు. అలాంటిది నెలలు నెలలు రాకపోతే ఏలా ఆ కార్మికుడు, ఆ కార్మికుడి కుటుంబం ఏలా బతుకుతుందో అధికారులు ఆలోచించాలి. ఇప్పటికైనా అధికారులు స్పందించి పెండింగ్ లో ఉన్న 2 నెలల వేతనాలను ఇప్పించాలి. లేకుంటే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మందమర్రి డివిజన్ పరిధిలో పనిచేస్తున్న కన్వేయన్స్ డ్రైవర్లు పాల్గొనడం జరిగింది.
========