మంత్రి పొన్నం ప్రభాకర్
సిరా న్యూస్,హుస్నాబాద్;
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తెలంగాణ రైతులకు 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పాంమని మంత్రి పొ్న్నం ప్రభాకర్ గుర్తు చేసారు. క్యాబినెట్ లో ఆ నిర్ణయం తీసుకున్న సందర్భంగా తెలంగాణ రైతాంగానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. త్వరలోనే రుణమాఫీ పై జీవో, విధివిధానాలు వస్తాయి. త్వరలోనే మీరు తీసుకున్న రుణాలు మాఫీ అవుతాయి. భవిష్యత్ లో వ్యవసాయాన్ని పండగ లాగా చేసుకునే విధంగా ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తుంది. రైతన్నలందరికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందనడానికి ఈ నిర్ణయమే నిదర్శనం. రైతు రుణమాఫీ మాట నిలుపుకున్న సందర్భంలో రైతులందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలుపుతున్నానని అన్నారు.
======================